ఇండిపెండెంట్ హౌజ్ లాగ కాకుండా అపార్టమెంట్స్ లో ఉండేటప్పుడు కొన్ని లాభాలు, కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా ఆ అపార్టమెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీలతో చర్చించి పరిష్కరించుకుంటారు. అయితే ఒకతను ఆ ప్రెసిడెంట్,సెక్రటరిలపైనే .కోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఏమిటో చూద్దాం. శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి తాను ఉంటున్న బాబుఖాన్ ఎస్టేట్స్ అపార్టమెంట్ లో వాటర్, కరెంట్ కట్ చేసేసారు. అప్పుడు ఆయన హై కోర్టుకు వెళ్ళారు. హై కోర్టు విచారణ చేసింది. నాకున్న ప్రాధమిక హక్కులకు భంగం కలిగించారు కాబట్టి వాళ్లపై చర్యలు తీసుకుని నాకు ఇమ్మీడియట్ గా కరెంట్,పవర్ ఇవ్వమన్నాడు. వాస్తవానికి అతను అపార్టమెంట్ లో ప్లాట్ కొనుక్కున్న ఇతను మెయింటినెన్స్ ఛార్జ్ కట్టలేదు. చాలా సార్లు అగిడారు. కట్టకపోతే వాళ్లు కట్ చేసారు. దాంతో కోర్టు కు వెళ్లి రివర్స్ కేసు వేసాడు. అప్పుడు కోర్టు... సెక్షన్ 21 ప్రకారం అపార్టమెంట్ సెక్రటరీ, ప్రెసిడెంట్ కు కొన్ని అధికారాలు ఉన్నాయనే విషయం గుర్తు చేసింది. దాని ప్రకారం మీరు మెయింటినెన్స్ కట్టకపోతే చర్యలు తీసుకునే అధికారం వాళ్లకు ఉంది అని తేల్చి చెప్పింది. ఈ తీర్పు పై ప్రముఖ న్యాయవ
గుజరాత్ లోని అహ్మదాబాద్కు చెందిన ఓ మహిళకు ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో ఆమె రూ.50 లక్షల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కింది . వివరాల్లోకి వెళితే..అహ్మదాబాద్ లోని చాముందగర్లో ఉండే నిరాలీ పర్మార్ ఆన్లైన్ ద్వారా పనీర్ టిక్కా శాండ్విచ్ ఆర్డర్ చేసింది. ఎప్పటిలాగే ఫుడ్ డెలీవరి బాయ్ ఇంటికి తీసుకొచ్చి పార్సిల్ అందించాడు. అయితే ఆమె ఆ శాండ్విచ్ను కొద్దిగా తిని షాకైంది. ఎందుకంటే అది పనీర్ శాండ్విచ్ కాదు. చికెన్ శాండ్విచ్. పూర్తిగా శాకాహారి అయిన ఆమె షాకైంది. వెంటనే అహ్మదాబాద్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. నష్టపరిహారంగా సదరు రెస్టారెంట్ తనకు రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది . తను పూర్తి శాకాహారినని, మాంసాహారం తినడాన్ని తమ మతం ఒప్పుకోదని రెస్టారెంట్ చేసిన తప్పిదంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. రెస్టారెంట్పై దావా వేసింది. సంబంధిత అధికారులు సదరు రెస్టారెంట్కు నోటీసులు పంపించారు.